చెన్నైః మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని పెరోల్ను మరో మూడు వారాలు మద్రాస్ట్ హైకోర్టు పొడిగించింది. వెల్లూరు కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నళినికి కుమార్తె వివాహ ఏర్పాట్లు చేసుకునేందుకు జూలై 25న నెల రోజుల పెరోల్ను మద్రాస్ హైకోర్టు మంజూరు చేసింది. అయితే తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదనీ.. మరో నెల రోజుల పాటు తన పెరోల్ ను పొడిగించాలని కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం మూడు వారాల పాటు పెరోల్ను పొడిగించింది.
previous post