చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ నెల రోజుల పెరోల్పై గురువారం వెల్లూరు జైలు నుండి విడుదలైంది. తన కుమార్తె హరిత్రా పెళ్లి ఏర్పాట్ల కోసం ఆరు నెలల పాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ నళిని ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అమె అభ్యర్థనపై విచారణ జరిపిన న్యాయస్థానం నెల రోజులు పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నళిని తల్లి, మరో మహిళ ఇచ్చిన పూచికత్తుపై ఈ పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్పై బయట ఉన్న సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని, రాజకీయ నాయకులను కలవొద్దని న్యాయస్థానం షరతులు విధించింది.
నళిని కుమార్తె హరిత్ర యుకెలో మెడిసిన్ చదువుతోంది. ఆమె వచ్చే వారం ఇండియాకు రానుంది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్ ఎల్టిటిఈ ఉగ్రవాదులతో కలిసి వ్యూహరచన చేశారు. కేసులో నళిని మురగన్ సహ ఏడుగురు దోషులుగా తేలారు. నళినికి తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ఆ తరువాత 24ఏప్రిల్ 2000న ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. గత 27సంవత్సరాలుగా నళిని వేలూరులోని మహిళా జైలులో శిక్షణ అనుభవిస్తుండగా, ఆమె భర్త మురుగన్ వేలూరు పురుషుల జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.