(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాల నుండి 55 రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. ఏపీ నుంచి మ్ఏ. ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి, తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావులు రిటైర్ అవుతున్నారు. ఖాళీ అవుతున్న స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 6న నోటిఫికేన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. అవసరమైతే మార్చి 26వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తారు.