జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. మృతిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ మరణించినట్లు ప్రచారం జరుగుతుంది.
అలాగే గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్లోని బాలాకోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడిలో మసూద్ మరణించాడని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించలేదు.
గత కొంతకాలంగా అజహర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారనీ, కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ప్రకటించిన విషయం తెలిసిందే.