అమరావతి: పట్టా దారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద నుండి కార్యాలయం లోనే నిర్భయంగా లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు ఓ రెవిన్యూ అధికారి. రాష్ట్రంలో అవినీతిపై పిర్యాదులు అధికంగా వస్తున్నాయని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మరో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అవినీతి కి పాల్పడే అధికారుల్లో మార్పు రావడం లేదు. ఓ పక్క లంచం డబ్బులు తీసుకున్నది కాకుండా పాసు పుస్తకం పని అయిపోయిన తరువాత సంతోషంగా మరో పది వేల రూపాయలు ఇవ్వండి అని అధికారి చెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఈ అవినీతి అధికారి బాగోతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.
previous post