రిషి కపూర్ ప్రస్తుతం బోన్ మారో కేన్సర్కి చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆయనకు బోన్ మారో కేన్సర్ ఉందని తేలింది. దీని గురించి ఆయన “నేను ఢిల్లీలో షూటింగ్లో ఉన్నప్పుడు నా వైట్ బ్లడ్ సెల్స్ తగ్గుతున్నాయని ఓ పరీక్షలో తెలిసింది. నన్ను న్యూయార్క్ కి వెళ్లమన్నారు. అప్పుడు నేను న్యూయార్క్ కి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను“ అని అన్నారు. న్యూయార్క్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలను కూడా ఆయన ఇటీవల అప్లోడ్ చేశారు. త్వరలోనే ఆయన ఇండియాకు చేరుకుంటారని తెలుస్తోంది. “నాకు మారో ప్రాబ్లం ఉంది. దాన్ని నయం చేసుకుంటున్నాను. అంతేం సీరియస్నెస్ లేదు. కానీ ఎక్కువ సేపు కూర్చుని ప్రయాణం ఎందుకని ఇక్కడే ఉంటున్నాను. ట్రీట్మెంట్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు“ అని ఆయన అన్నారు. న్యూయార్క్ కి వెళ్లిన మన సెలబ్రిటీలు రిషి కపూర్ని పలకరిస్తూనే ఉన్నారు. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్… ఇలా ఎంతో మంది ఆయన కలిశారు.
previous post
next post