అహ్మదాబాద్: భారీ వర్షాలు గుజరాత్ను వణికిస్తున్నాయి. వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. తాజాగా వరద దాటికి ఓ వంతెన ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. జూనాగఢ్లోని మలంకా గ్రామంలో నదిపై వంతెన పేక మేడలా కుప్పకూలింది. వాహనాలు రాకపోకలు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో దానిపై నుంచి వెళ్తున్న కార్లు ఒక్కసారిగా అందులోనే ఇరుక్కుపోయాయి. వంతెనపై ఉన్న కార్లన్నీ ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానికులు సాయం చేశారు. 40 ఏళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించారని జూనాగఢ్ కలెక్టర్ సౌరభ్ పార్ది తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడటతో ప్రమాదం తప్పిందన్నారు.
previous post
next post