ఢిల్లీ నుంచి హరిద్వార్కు కాలినడకన యాత్ర చేస్తున్న కన్వరియాలు, Photo Credit: Indian Express
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
యోగీ ఆదిత్యనాధ్ ఏలుబడిలో పోలీసులు విచక్షణారహితంగా ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్లో ఒక ఉన్నతాధికారి ప్రజలకు సేవ చేయడం పరమావధిగా ఎంచి ఒక కన్వరియాకు కాళ్లు పట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
హరిద్వార్ పాదయాత్ర చేసే భక్తులను కన్వరియాలు అంటారు. షామ్లి జిల్లాలో వారి కోసం ఏర్పాటు చేసిన ఒక వైద్య శిబిరంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అజయ్ కుమార్ పాండే ఒక యాత్రికుడి పాదాలు నొక్కి అతనిని సేద తీర్చారు. షామ్లి పోలీసు ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టు చేశారు. భద్రతతో పాటు సేవ కూడా అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
सुरक्षा के साथ-साथ सेवा भी।
आज दिनांक 26.07.19 को SP शामली श्री अजय कुमार द्वारा चिकित्सा शिविर का उद्धघाटन किया गया तथा चिकित्सा शिविर में आये हुए भक्तो की सेवा की गई। @Uppolice @policenewsup @News18India @ABPNews @aajtak @adgzonemeerut pic.twitter.com/zSmRX9VIlP
— Shamli Police (@shamlipolice) July 26, 2019
ఆధునిక పోలీసు విధులు చాలా విశాలమైనవి. శాంతి భద్రతలు, నేరాల దర్యాప్తుతో పాటు మానవతతో వ్యవహరించడం, దయ చూపడం కూడా పోలీసు డ్యూటీలో భాగమే అని పాండే అన్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది.