NewsOrbit
టాప్ స్టోరీస్

పవార్- మోదీల భేటీ వెనుక మతలబేంటి ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కావడంతో మహా రాజకీయం మరింత వేడెక్కింది. పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానితో శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలోని రైతుల సమస్యలపై మోదీతో పవార్ చర్చించారు. దీంతోపాటు మహారాష్ట్ర రాజకీయాలు గురించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధానికి పవార్ ఓ లేఖను అందజేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని దానిలో ప్రస్తావించారు. ప్రధాని మోదీ చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరినట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమై చర్చించేదుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీని రద్దు చేసుకుని మరీ ప్రధాని మోదీతో సమావేశం కావడంతో రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశంతో పాటు, పవార్‌కు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఆఫర్‌ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. మహారాష్ట్రలో జరుగుతున్నపరిణామాలే ఇందుకు ఉదాహరణ. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇక ఈ ప్రచారంపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఇద్దరు నేతలు కలిస్తే ఎలా పడితే అలా ఊహించేస్తారా, ప్రధాని దేశం మొత్తానికీ చెందిన వ్యక్తి అని ఆపార్టీ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. మహారాష్ట్రలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, పవార్‌, ఉద్ధవ్‌ ఇద్దరూ వారి గురించే ఆలోచిస్తున్నారన్నారు. ఇదిఇలా ఉంటే.. మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరకున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని శివసేన విశ్వాసం వ్యక్తం చేస్తోంది. డిసెంబరుకు ముందే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు విషయమై రెండు వారాల కింద ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవని, ఇక సాగదీత ఉండదని ఆపార్టీ పేర్కొంది.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలుండగా బీజేపీ 105, శివసేన 56, ఎన్‌సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన పార్టీలకు సీఎం పీఠం వద్ద పేచీ వచ్చింది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగింది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ బీజేపీ, శివసేన కూటమికి వచ్చింది. అయితే, సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ప్రతిపాదించింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా.. అందుకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ.. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక సమర్పించారు. గవర్నర్ సిఫారసును మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment