అమరావతి: అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుండి సింగపూర్ ప్రభుత్వం తప్పుకున్నది. ఏపి ప్రభుత్వం, సింగపూర్ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుండి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. స్టార్టప్ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపిలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్లోద్దని కోరిందని ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన విడుదలైంది.
రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకారాల్లో స్టార్టప్ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లో ఒప్పందం కుదిరింది.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్ కంపెనీ పెట్టుబడులపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండబోదని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.