శ్రీనగర్: సిపిఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రదాన కార్యదర్శి డి రాజాలను శుక్రవారం శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. అనారోగ్యంతో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్వై తరిగామిని కలుసుకునేందుకు వెళ్లినట్లు ఏచూరి తెలిపారు.
ఇద్దరు నాయకులూ తమ పర్యటన గురించి జమ్ము కశ్మీర్ గవర్నర్కు విడివిడిగా లేఖలు రాశారు. ఇద్దరూ శ్రీనగర్ విమనాశ్రయంలో దిగగానే భద్రతా దళాలు వారిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శ్రీనగర్ లోపలికి వెళ్లరాదని చెబుతున్న ఒక ఉత్తర్వు కాపీని తమకు చూపించారనీ, వెంట భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ భద్రతా కారణాల వల్ల నగరంలోకి అనుమతించడం కుదరదని ఆ ఉత్తర్వులో ఉన్నదనీ వారు తెలిపారు.
తమ నాయకులను విమానాశ్రయంలో నిర్బంధించడాన్ని సిపిఎం తీవ్రంగా తప్పు పట్టింది. గురువారం ఇలాగే కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ను కూడా శ్రీనగర్ విమానాశ్రయంలో నిర్బంధించారు. ఆయన అక్కడ నుంచే వెనుతిరిగి ఢిల్లీ వచ్చారు.