హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా పనిచేసిన ఎస్కే జోషి నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన్ను నీటిపారుదల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
కొత్త సీఎస్ రేసులో అజయ్మిశ్రా, సోమేష్కుమార్, శాంతికుమారి, అధార్సిన్హా ఉండగా… వీరిలో సోమేశ్ కుమార్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. అయితే 1985 బ్యాచ్కు చెందిన అజయ్ మిశ్రాకు సీనియారిటీ ఎక్కువ, కాకపోతే ఆయన వచ్చే జులైలో పదవీ కాలం ముగియనుంది. ఇక సోమేశ్ కుమార్కు సర్వీస్ ఇంకా మూడేళ్లు ఉంది. అయితే ఆరు నెలల్లో రిటైరయ్యే అజయ్ మిశ్రా కంటే మూడేళ్ల సర్వీస్ కలిగిన సోమేశ్ కుమార్ వైపే సిఎం కెసిఆర్ మొగ్గు చూపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా సోమేశ్ను ఏపీ కేడర్కు కేటాయించగా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో సీఎం తన విచక్షణాధికారంతో సోమేశ్ను సిఎస్ గా ఎంపిక చేశారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గానూ విధులు నిర్వహించారు. కేసీఆర్కు నమ్మకస్తుడైన అధికారిగా సోమేశ్ కుమార్కు గుర్తింపు ఉంది.