అమరావతి, మార్చి 20: జనసేన పార్టీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిత్వాన్ని సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఎస్ పి వై రెడ్డికి ఖరారు చేశారు.
టిడిపిని వీడిన ఎస్ పి వై రెడ్డి బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాన్ సమక్షంలో పార్టీలో చేరారు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎస్ పి వై రెడ్డిని జనసేనాని పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. వెంటనే నంద్యాల పార్లమెంట్ అభ్యర్ధిగా ప్రకటించి బి ఫారం అందించారు.
నిజాయితీ, నిబద్దత కల్గిన సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఎస్ పి వై రెడ్డి జనసేనలో చేరడం పార్టీకి నూతనోత్సాహం ఇస్తుందని పవన్ అన్నారు. నంద్యాల పార్లమెంట్ జనసేన కైవశం చేసుకోవడం ఖాయమని పవన్ పేర్కొన్నారు.
2004 నుండి 2019 వరకూ ఎస్ పి వై రెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.