(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
మధ్యాహ్న భోజన పధకం కింద ప్రాధమిక పాఠశాల పిల్లలకు రొట్టెలతో పాటు ఉప్పు పెడుతున్న విషయాన్ని బయటపెట్టినందుకు ఓ హిందీ పత్రిక జర్నలిస్టుపై ఉత్తరప్రదేశ్ప్రభుత్వం కేసు పెట్టింది. మీర్జాపూర్ జిల్లాలోని సేయూర్ ప్రభుత్వ పాఠశాలలో సాగుతున్న ఈ తతంగంపై ఆ జర్నలిస్టు పది రోజుల క్రితం తీసిన వీడియో వైరల్ అయింది.
జర్నలిస్టుపై కేసు పెట్టడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. అనంతరం రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి కూడా కేసు పెట్టి ఉండాల్సింది కాదని అన్నారు. జనసందేశ్ టైమ్స్ స్థానిక రిపోర్టర్ పవన్ జైశ్వాల్తో పాటు మీర్జాపూర్ ప్రధాన్ ప్రతినిధి రాజ్కుమార్ పాల్పై కేసు నమోదు చేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారని వీరిపై అభియోగం మోపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో వచ్చిన కార్టూన్
ఆ స్కూలులో పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదు తనకు చాలాసార్లు అందిందనీ, ఆగస్టు 22న మరోసారి అలాంటి ఫిర్యాదు రావడంతో అక్కడకు వెళ్లి వీడియో తీశాననీ జైస్వాల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు తెలిపారు. తాను ఆ వీడియోను ఎఎన్ఐ జర్నలిస్టుకు ఇచ్చానని అయన చెప్పారు. తాను తన విధి నిర్వర్తించాననీ, ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టిందనీ ఆయన ఆరోపించారు.
The FIR is in sharp contrast to what DM Anurag Patel had earlier said.#Mirzapur #UttarPradesh pic.twitter.com/qrBh2jj1J8
— InUth (@InUthdotcom) September 2, 2019