అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదని ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. రాజధానిలో తనకు సెంటు భూమి వుంటే చూపించాలని రెండు నెలల క్రితం సవాల్ చేస్తే జవాబు లేదన్నారు. ‘సేవ్ అమరావతి’, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ట్యాగ్ లైన్స్ తో ఓ ట్వీట్ చేసిన సుజన..పలు వీడియోను పోస్ట్ చేశారు. అమరావతి రైతులను కలిసిన సుజనా చౌదరితో రైతులు తమ బాధలు వ్యక్తం చేస్తుండటం ఈ వీడియోలో కనబడుతుంది. రైతులు, వారి కుటుంబీకులు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. అరెస్టు చేసిన రాజధాని రైతులపై సెక్షన్ 307 అమలు చేసిన విషయాన్ని సుజనా చౌదరి వద్ద ఓ రైతు భార్య ప్రస్తావించగా, దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేద్దామని సుజనా అన్నారు. కొంచెం ఓపిక పడితే, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళతామన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. అమరావతి రైతులపై పోలీసుల అత్యుత్సాహం తగదని, కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని చెప్పారు.
మీకు నష్టం జరగకుండా చూసే బాధ్యత నాది. పోలీసులు అత్యుత్సాహంతో కక్ష సాధింపు చర్యలకు దిగటం సరికాదు. #SaveAmaravati #SaveAndhraPradesh pic.twitter.com/SwpYOuFLLu
— YS Chowdary (@yschowdary) January 1, 2020
నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి శిలాఫలకం వద్ద మౌనదీక్ష చేసున్న సమయంలో ‘మమ్మల్ని మీరు పెయిడ్ ఆర్టిస్టులా? ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారుటగా?’ అని ఓ ఛానెల్ ప్రతినిధి తమ వాళ్లను అడగడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఇక్కడే ఉంటే.. చంపేస్తారని చెప్పి’ సదరు ఛానెల్ ప్రతినిధిని పంపించి వేశామని మహిళ వివరించారు. దీంతో ఆ సంఘటనతో ఆందోళన చెందొద్దని సుజనా చెప్పారు.
ఎపిని రక్షించండి అనే నినాదంతో 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలి. మీ అందరికీ నేనున్నాను. #SaveAndhraPradesh #SaveAmaravati @BJP4Andhra @BJP4India pic.twitter.com/ibK0VMML2h
— YS Chowdary (@yschowdary) January 1, 2020
రాజధాని తరలించొద్దంటున్న తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సుజనా తెలిపారు. అమరావతి ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు. రైతులు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ స్లోగన్ తో రైతులు తమ నిరసనలు తెలపాలని సూచించారు. రాజధాని మార్చాలన్నది అంత తేలికకాదని, ఇదేమీ చిన్నపిల్లల వ్యవహారం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ చూస్తూ ఊరుకోవని స్పష్టం చేశారు. అధికారపక్షం తరపున పోలీసులు పనిచేయొద్దని, న్యాయపరంగా పని చేయాలని సూచించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి శంకుస్థాపన చేసిన అమరావతిని అంగుళం కదిలించినా బిజెపి చూస్తూ ఊరుకోదు. రాజధానిలో నాకు సెంటు భూమి వుంటే చూపించండని రెండు నెలల క్రితం సవాల్ చేస్తే జవాబు లేదు. pic.twitter.com/N8OHGt8Iw6
— YS Chowdary (@yschowdary) January 1, 2020
ఈ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం బనానా రిపబ్లిక్ గా మారే ప్రమాదం ఏర్పడింది. #SaveAmaravati @BJP4Andhra @BJP4India pic.twitter.com/b8Y3IXEkai
— YS Chowdary (@yschowdary) January 1, 2020