ఢిల్లీ: 50శాతం వివి ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు వివి ప్యాట్ స్లిప్లు లెక్కించాలని సుప్రీం ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. అయితే వివి ప్యాట్ల స్లిప్ల లెక్కింపు కనీసం 50శాతానికి పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని 21 రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు ఈ పిటిషన్పై విచారణ జరిపి గతంలో ఇచ్చిన అదేశాలు మార్చాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
విచారణ సమయంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సిపిఐ నేత డి రాజా కోర్టుకు హాజరయ్యారు.