ఢిల్లీ: అయోధ్య భూ వివాదంపై మధ్యవర్తిత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్యానెల్ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎన్ఎ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్ను నియమించింది.
ప్యానెల్ చైర్మన్గా జస్టిస్ ఖలీఫుల్లా, సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులను నియమించింది.
మధ్యవర్థిత్వ ప్రక్రియ నాలుగు వారాల్లోగా ప్రారంభించి ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా రామ్లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని గతంలో అలహాబాదు హైకోర్టులో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలయిన 14 పిటీషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వ ప్యానెల్ను నియమించింది.