ఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఇవిఎం) వివిప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
కనీసం 50శాతం వివి ప్యాట్లను అయినా లెక్కించాలంటూ 21 రాజకీయ పక్షాలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి.
50శాతం వివిప్యాట్లు లెక్కించాలంటే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం తెలియజేసింది. గతంలో లెక్కించినట్టే ఒక్కో నియోజకవర్గం నుండి ఒక్క వివిప్యాట్ను మాత్రమే తీసుకుని లెక్కిస్తామని ఎలక్షన్ కమిషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం కోర్టు లెక్కించాల్సిన వివిప్యాట్ల సంఖ్యను ఒకటి నుండి ఐదుకు పెంచింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు ఈవిఎంల వివిప్యాట్లు చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వివి ప్యాట్లు లెక్కించాలని ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశించింది.