న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు… బుధవారం మరో కీలక తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సమాచారహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పును ఇవ్వనుంది. సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రెండూ ప్రభుత్వ సంస్థలేనని… అవి కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని ఢిల్లీ హైకోర్టు 2010లో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది తీర్పును వెలువరించనుంది.
previous post
next post