హైదరాబాద్: తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ ను కేంద్రం నియమించింది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమిస్తున్నట్టు ప్రకటించింది. తమిళిసై సౌందరరాజన్ కు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. తమిళనాడు బీజేపీ యువ మహిళా నేతగా తమిళిసై సౌందరరాజన్ పని చేశారు. వృత్తిరిత్యా ఆమె వైద్యురాలు. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్కోయిల్లో జన్మనించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందరరాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఆమె తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నేత కుమారీ ఆనందన్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి కాంగ్రెస్ లో న్నా..తాను మాత్రం బీజేపీ సిద్ధాంతాలపై ఆకర్షితులయ్యారు. బీజేపీలో అనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను కేంద్రం ప్రభుత్వం తెలంగాణ గవవర్నర్ గా నియించింది.
మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోశ్యారిని నియమిస్తూ కూడా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ గవర్నర్ గా కల్ రాజ్ మిశ్రాను, కేరళకు ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ను నియమించింది. దీంతో, మొత్తం మీద ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చినట్లు అయింది. ఇదిలావుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా.. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సుదీర్ఘకాలం పాటు గవర్నర్గా పనిచేసి.. కొద్ది నెలల క్రితం తెలంగాణకే గవర్నర్ నరసింహన్ను పరిమితం చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆయన బదిలీ చేసిన సంగతి తెలిసిందే.