అమరావతి: ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ శంబంగి చిన్న వెంకటఅప్పలనాయుడు ప్రకటించారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తదితరులు తమ్మినేనిని అధ్యక్ష స్థానం వద్దకు సాదరంగా తీసుకువెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.
తమ్మినేని సీతారాం ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మూడు పర్యాయాలు టిడిపి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.