(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా చిన కాకాని వద్ద జాతీయ రహదారి దగ్బంధానికి బయలుదేరిన గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకుని నోటీసులు అందజేశారు. ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జయదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశానని నోటీసులు ఇస్తారని పోలీసులను జయదేవ్ ప్రశ్నించారు. నేనేమైనా హింసకు పాల్పడ్డానా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో అత్యధికంగా పన్ను కట్టేది నేను అనేది మీకు తెలిసా? మీ జీతాలు అన్ని నేనే కడుతున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ చర్యలు చాలా అవమానకరం అని జయదేవ్ పేర్కొన్నారు.
పోలీసులు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని జయదేవ్ ఆరోపించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం దారణమన్నారు. ఇవాళ చీకటి రోజుగా అభివర్ణించారు. రాజధానిపై సిఎం ముందే చెప్పేశారనీ, సిఎం చెప్పిన విధంగానే కమిటీల నివేదకలు ఇస్తున్నాయనీ, సిఎం ప్రకటనకు విరుద్ధంగా కమిటీల నివేదికలు ఇచ్చే పరిస్థితి ఉండదనీ జయదేవ్ అన్నారు.
Capital #Amaravati protest day 21-#TDP MP Galla Jaydev placed under house arrest ahead of highway blocked protest called by JAC of capital region farmers. The lawmaker alleged that the ruling #YSRCP is using the undemocratic method to suppress the opposition voice. #AndhraPradesh pic.twitter.com/u6vgThx3Wr
— Aashish (@Ashi_IndiaToday) January 7, 2020