అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో సారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్ పై సెటైర్ వేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే పరిపాలన సజావుగా సాగుతుందని కేంద్రం వెల్లడిస్తున్న తరుణంలో ఏపికి మూడు రాజధానులు ఎందుకని నాని ప్రశ్నించారు. ‘నీకున్న తెలివితేటలు మోదీగారికి లేవు జగన్. ఢిల్లీలో వున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేరు వేరు చోట్ల వుండటం వల్ల సమర్థవంతంగా పని జరగటం లేదని ఒకే చోటుకు తీసుకువస్తున్నారు. పొరపాటున నువ్వు ప్రధానమంత్రి అయి ఉంటే 28 రాష్ట్రాలలో 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 36 రాజధానులు పెట్టేవాడివి’ అని నాని ఎద్దేవా చేశారు.
previous post
next post