అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని హామీల ప్రస్థావన లేకపోవడంపై టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడ్జెట్పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేశినేని నాని. ఇదే సందర్బంలో ఇటీవలే టిడిపి నుండి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యులకూ చురకలు అంటించారు.
‘మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్దరించడానికి బిజెపిలోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ నిన్న బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమయ్యింది. ఈ రాష్ట్రానికి ఉద్దరించడానికి బిజెపిలో చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవడానికి బిజెపిలో చేరారో’ అని అంటూ కేశినేని వంగ్యాస్త్రాన్ని సంధించారు. ప్రధాని మోదికి రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్ శాలువాతో సత్కరిస్తున్న ఫోటో దీనికి ట్యాగ్ చేశారు.
https://www.facebook.com/Kesineninani.TDPVijayawada/photos/rpp.155184094662465/1239430916237772/?type=3&theater
As usual injustice to Andhra Pradesh in the budget no mention about Polavaram,Amaravati and other grants under reorganisation act.
Disappointing!!!— Kesineni Nani (@kesineni_nani) July 5, 2019