అమరావతి: ఏపి శాసనసభ నుండి వరుసగా మూడో రోజు టిడిపి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. హైదరాబాదులోని ఏపి ఆస్తులను తెలంగాణకు ఎలా అప్పగించారని టిడిపి నేతలు అధికారపక్షాన్ని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షం సభలో డిమాండ్ చేసింది. ఈ అంశంపై టిడిపి సభ్యుడు అనగాని సత్యప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి సమాధానం తర్వాత ఆయన తిరిగి మాట్లాడేందుకు అవకాశం కల్పించకపోవడాన్ని టిడిపి సభ్యులు తప్పుబట్టారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇచ్చిన నోట్లకు ప్రతిఫలంగా ఏపి భవనాలను తెలంగాణకు అప్పగించారని టిడిపి నేతలు ఆరోపించారు. స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబుతో సహా టిడిపి సభ్యులు సభ నుండి నినాదాలు చేస్తూ బయటకు వచ్చేశారు.