(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీమిండియా ‘సూపర్ఫ్యాన్’ చారులతా పటేల్ కన్నుమూశారు. జనవరి 13న ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతేడాది ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్కప్లో చారులతా పటేల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 87 ఏళ్ల వయసులో చారులా పటేల్ క్రికెట్ మ్యాచ్లకు చూడటానికి స్టేడియానికి వచ్చీ మరీ మ్యాచ్లను వీక్షించారు. టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చారులతా పటేల్ ఒక సెలబ్రెటీగా మారిపోయారు. మ్యాచ్ జరుగుతున్నంతా సేపు అభిమానుల్ని ఉత్సాహ పరుస్తూ ఆమె సందడి చేశారు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆమెతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
చిన్నప్పట్నుంచి క్రికెట్కు వీరాభిమాని అయిన చారులతా పటేల్.. భారత్ ఆడే మ్యాచ్లను క్రమం తప్పకుండా టీవీల్లో వీక్షించేవారు. 1983లో కపిల్ సేన ప్రపంచ కప్ను ముద్దాడిన సమయంలో తాను స్టేడియంలోనే ఉన్నానని విషయాన్ని చారులతా పటేల్ ఇది వరకే తెలిపారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
చారులతా పటేల్ మృతిపై బీసీసీఐ కూడా సంతాపం వ్యక్తం చేసింది. “టీమిండియా సూపర్ ఫ్యాన్ చారులత పటేల్ ఎప్పటికీ మా గుండెల్లో నిలిచి ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి” అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
#TeamIndia's Superfan Charulata Patel ji will always remain in our hearts and her passion for the game will keep motivating us.
May her soul rest in peace pic.twitter.com/WUTQPWCpJR
— BCCI (@BCCI) January 16, 2020