హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. అసెంబ్లీలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మండలిలో బడ్జెట్ను ఆర్థికమంత్రి హరీష్రావు ప్రవేశపెట్టారు. శనివారం బడ్జెట్పై ఉభయ సభల్లో చర్చించనున్నారు.
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు…
* 2019-20 సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ. 1,46,492 కోట్లు.
* రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు.
* మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.
* బడ్జెట్ అంచనాలో మిగులు రూ. 2,044.08 కోట్లు.
* ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు.
* రైతు బంధుకు రూ. 12 వేల కోట్లు.
* రైతు బీమా కోసం రూ. 1,135 కోట్లు.
* ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 8 వేల కోట్లు.
* ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు.
* రైతు రుణ మాఫీకి రూ. 6 వేల కోట్లు.
*ఆరోగ్య శ్రీకి ఏడాదికి రూ. 1,336 కోట్లు.
* మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు.
* గ్రామ పంచాయతీలకు రూ. 2,714 కోట్లు.
* రైతు బీమా ప్రీమియానికి రూ. 1,137 కోట్లు.
* కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఇకపై ఉద్యోగాల నియామకం.
* వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పింఛన్ రూ. 1000 నుంచి రూ. 2016కు పెంపు.
* బీడీ కార్మికులకు పింఛన్ కటాఫ్ తేదీ తొలగింపు.
* వికలాంగులకు, వృద్ధ కళాకారుల పింఛన్ రూ. 3,016కు పెంపు.
* అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు