హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్పై నమోదైన ఫేక్ ఐడీ కార్డు కేసుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో రవిప్రకాష్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒక మనిషిని ఎంతలా హింస పెడుతారని ప్రశ్నించింది. రవిప్రకాష్ను జీవితాంతం జైల్లో పెడుతారా? అని హైకోర్టు నిలదీసింది. పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే.. కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. రవిప్రకాష్పై నమోదైన కేసులు వివరాలను.. మంగళవారంలోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ ఐడి క్రియేట్ చేసినట్టు రవిప్రకాష్పై అభియోగాలు నమోదయ్యాయి. 406/66 ఐటీ యాక్ట్ కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాష్కు నాపంల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.