హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేబినెట్ ప్రొసీడింగ్స్ను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. 5100 రూట్లను ప్రయివేటీకరణ చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు పిల్ ధాఖలు చేశారు. 5100 రూట్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని అందుబాటులోకి ఎందుకు తేలేదని న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ ప్రొసీడింగ్స్ను ప్రభుత్వం కోర్టు ముందు ఉంచింది. కేవలం కేబినెట్ నిర్ణయమే కాబట్టి ప్రజలకు అందుబాటులోకి తేలేదని ప్రభుత్వం తెలిపింది. జీవో వచ్చాక అందరికీ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. అయితే, ఆర్టీసీ నోటీస్లో పెట్టకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు నిలదీసింది. అనంతరం రూట్ల ప్రైవేటీకరణపై స్టే కొనసాగిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
previous post
next post