హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆర్టిసి కార్మికులు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్మికులు ఉత్సాహంగా విధుల్లోకి చేరుతూ సిఎం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంస్థ పురోభివృద్ధికి సహకరిస్తామని పేర్కొంటున్నారు. అమరులైన కార్మిక కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో కెసిఆర్కు కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ కార్మికుల సంబరాలు చేసుకుంటున్నారు.
previous post