శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లోని షోపియాన్లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దివంగత హిజ్బుల్ కమాండర్ బుర్హన్ వానీ సన్నిహితుడు లతీఫ్ దార్ అలియాస్ లతీఫ్ టైగర్తో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు జమ్ము కాశ్మీర్లోని అన్ని అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో షోపియాన్ జిల్లా ఇమామ్ షాహిబ్ దగ్గరలోని అద్వారా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా భద్రతా బలగాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాబలగాల ఎదురుకాల్పుల్లో లతీఫ్ టైగర్తో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు అధికారి తెలిపారు.
2016లో సైన్యం చేతిలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీకి లతీఫ్ టైగర్ సన్నితుడనీ, అతను 2014లో ఉగ్రవాదంలో చేరారని పోలీసు అధికారి తెలిపారు. దక్షిణ కాశ్మీర్లో అనేక హత్య కేసుల్లో అతనికి ప్రమేయం ఉందని ఉందనీ, బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్కు లతీఫ్ సన్నిహితుడైయ్యారని చెప్పారు.
లతీఫ్ హతం కావడంతో కాశ్మీర్లో ఒక తరం ఉగ్రవాద నాయకులంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లైంది.