శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. వీరి రాకను పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు అక్కడ ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
previous post