(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో ఓ పులి నదిలోకి దూకి మరణించింది. చంద్రాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న సిర్నా నది వద్ద ఈ ఘటన జరిగింది. గురువారం నది బండరాళ్ల మధ్య పులి మృతదేహం అటవీ అధికారులకు లభించింది. బుధవారం దప్పిక తీర్చుకునేందుకు 35 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి ఆ పులి నదిలోకి దూకింది. అయితే, నది ఒడ్డున రెండు బండ రాళ్ల మధ్య అడుగుపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. 35 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జిపై నుంచి పులి కిందకు దూకడం వల్ల దాని వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో నదిలో ఈదలేక చివరకు ప్రాణాలు కోల్పోయింది.
పులి నదిలో పడిందని సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది..దానిని కాపాడేందుకు 24 గంటల పాటు ప్రయత్నించారు. అయినా పులిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. కునాడా గ్రామం వద్ద ఉన్న సిర్నా నది రాళ్ల మధ్య పులి మృతదేహం లభించింది. రాత్రి పూట పులి కదలికలపై నిఘా పెట్టినా ఎటువంటి ప్రయోజనం జరగలేదు. పులి మృతదేహాన్ని అటాప్సీ పరీక్షల కోసం పంపించినట్లు చంద్రపూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి రామారావు తెలిపారు.
https://youtu.be/tugMRoh2UvA