హైదరాబాద్: తిరంగా ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏజెంట్గా పనిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు.. ప్రభుత్వానికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్ క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అవినీతిలో కూరుకుపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సీసీగా ఉండే అర్హత లేదన్నారు.
‘జెండా ఆవిష్కరణకు మా కార్యకర్తలు వస్తే వారిని ఆపేస్తారా. నీ సంగతి చూస్తా. ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చావు. ఉద్యోగం చేసుకొని సరిగ్గా వెళ్లిపో. పునర్వభజన చట్టంలోని సెక్షన్ 8 కింద గవర్నర్కు హైదరాబాద్పై సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. అహంకారం, పొగరుబోతు విధానాన్ని ఎలా అణచాలో తెలుసు’ అని వ్యాఖానించారు. సీపీ అంజనీ కుమార్పై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీపీ అంజనీకుమార్ తన పేరుకు ముందు ఐపీఎస్ తీసేసి కేపీఎస్ అని పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. కేపీఎస్ అంటే కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని చెప్పారు. సోమవారం గవర్నర్ను కలిసి అంజనీకుమార్ తీరుపై ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్ తెలిపారు. గాంధీభవన్లో దీక్ష చేస్తుంటే కార్యకర్తలను అడ్డుకుంటారా ? కార్యకర్తలు రాకుండా అడ్డుకోవడానికి మీరెవరు ? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, ఎంఐఎం సభలకు అనుమతినిచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం.. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమకు ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. కాగా, పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లోనే 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేట్టిన సంగతి తెలిసిందే.