న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే.. ఒక్కసారిగా వాళ్ల మీద ట్రోలింగ్ వెల్లువెత్తింది. అదే సమయంలో కొందరు వాళ్లకు మద్దతుగా కూడా నిలిచారు. పార్లమెంటులో చాలామంది మహిళా సభ్యులు చీరలు కట్టుకునే వస్తారని, కానీ వీళ్లు మాత్రం దుస్తుల్లో మార్పు తెచ్చారని అన్నారు. మిమి, నస్రత్ ఇద్దరూ ప్యాంట్లు, టాప్ వేసుకుని ఫొటో తీసుకున్నారు. దాంతో పార్లమెంటుకు తగిన దుస్తులు వాళ్లు వేసుకోలేదంటూ పలువురు విమర్శలు గుప్పించారు. ‘‘పార్లమెంటు అంటే ఫొటోస్టూడియో కాదు’’ అని ఒకరన్నారు. మరొకరు మిమీ గురించి వ్యాఖ్యానిస్తూ ‘‘ఆమె ఈ స్థానానికి తగిన వ్యక్తి కాదు’’ అని మండిపడ్డారు.
A new beginning..!! I thank @MamataOfficial and people of my #Basirhat constituency to have belief in me.. pic.twitter.com/GU4Xcyz1Ff
— Nusrat Jahan Ruhi (@nusratchirps) May 27, 2019
అయితే, వాళ్లకు మద్దతిచ్చిన వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. నస్రత్ జహాన్ ‘యాటిట్యూడ్’ బాగుందని ఒక యూజర్ ప్రశంసించారు. మరొకరు ఆమె విజయంపై అభినందనలు చెబుతూ సివంగిలా పనిచేయాలని ప్రోత్సహించారు. కొందరు విమర్శించిన నేపథ్యంలోనే ఈ మద్దతు వచ్చింది.
Even I just can't unsee this.
Absolutely classy, adorable, fresh, young, dynamic next-gen leadership that India has got.
She represents her generation. And she must wear this identity proudly on her sleeves. https://t.co/mEIUKuWovs
— Yashwant Deshmukh ?? (@YRDeshmukh) May 28, 2019
బెంగాలీ హీరోయిన్లయిన వీరిద్దరూ పార్లమెంటు ముందు తమ ఐడీకార్డులు పట్టుకుని చూపిస్తూ ఫొటోలు దిగారు. ‘‘ఇది మళ్లీ మేమే. పార్లమెంటులో తొలిరోజు’’ అని మిమీ చక్రవర్తి ట్వీట్ చేసి, అందులో నస్రత్ జహాన్ ను కూడా ట్యాగ్ చేసింది. ఆమె తెల్ల చొక్కా, నీలం జీన్సు వేసుకుని రాగా, నస్రత్ జహాన్ వైన్ రంగు పెంప్లమ్ టాప్, ప్యాంటు వేసుకుని వచ్చింది. నస్రత్ కూడా ట్విటర్ లో పార్లమెంటు ముందున్న ఫొటోను పెట్టి, తమ విజయానికి గాను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తన నియోజకవర్గ ప్రజలకు థాంక్స్ చెప్పింది.