ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ లో ఉంది. గడిచిన మూడు గంటలుగా పరిశీలిస్తే ట్విట్టర్ లో “నమస్తే ట్రంప్” గంటకు లక్షన్నర వరకు ట్వీట్లు పడుతున్నాయి. అంతగా దేశం ఇప్పుడు ట్రంప్ పర్యటనతో అల్లుకుపోయింది. ఇక దేశంలో అడుగిడి, మొతేరా మైదానాన్ని ఆరంభించి తోలి ప్రసంగంలో ట్రంప్ ఆకట్టుకున్నారు. ప్రధాని మోదీని, దేశాన్ని ఆకాశానికి ఎత్తేసారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆయన భారత్ – అమెరికా మధ్య జరగనున్న రక్షణ ఒప్పందాలపై కీలక ప్రకటన చేసారు. ౩ బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందంపై రేపు సంతకాలు చేయనున్నట్టు తెలిపారు. “తమ దేశాల ప్రతినిధులు మా సమక్షంలో రేపు ఇరు దేశాల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తారు. రక్షణ పరికరాలు, యుద్ధ హెలికాఫ్టర్లు, ఇతర రక్షణ అంశాలపై ఒప్పందంపై ఉంటుంది. మా ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతుంది. భారత్ కి అధునాయాతన ఆయుధాలు, ఆర్మీ పరికరాలు సరఫరాకు అమెరికా సిద్ధం” అని ఆయన పేర్కొన్నారు. పనిలో పనిగా దేశ సంస్కృతిని, మోడీ పాలనని ప్రశంసలతో ముంచెత్తారు. దేశానికి రావడం తనకు గర్వంగా ఉందన్నారు.
అడుగడుగునా ఘన స్వాగతం..!
ట్రంప్ స్వాగత ఏర్పాట్లు అహ్మదాబాద్ లో అదిరిపోయాయి. ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ, సహా ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలుతో, వివిధ వాయిద్యాలు, మిలిటరీ విభాగాలతో స్వాగతం పలికారు. మొతేరా క్రికెట్ మైదానం ప్రారంభించిన తర్వాత ట్రంప్ అక్కడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గాంధీజీ ఒడికిన దారపు రాట్నాన్నిట్రంప్ దంపతులు తిలకించి, కొద్దిసేపు అక్కడే కూర్చుని దారాన్ని ఒడికారు. ప్రధాని మోడీ దగ్గరుండి ఈ పర్యవేక్షిస్తూ పూర్తిగా వివరించారు. ప్రసుతం ట్రంప్ తాజ్ మహల్ సందర్శనకు ఆగ్రా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇవంక ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.