(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏదైన సంఘటన జరిగే.. ఆ స్థలం నుంచి వార్తకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ద్వారా రిపోర్టర్లు అందిస్తారు. అయితే, న్యూస్ రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుడికి ఓ పంది చుక్కలు చూపించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో భారీ తుపాను సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో రిపోర్టింగ్ చేయాడానికి ఓ న్యూస్ చానల్ రిపోర్టర్ లాజోస్ మాంటికో వరదలు సంభవించిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి స్టూడియోకు లైవ్ ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా ఓ పంది అతడి వెంటపడింది.
Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB
— ?????? ????????? (@KallergisK) November 26, 2019
మాంటికో ఎటు వెళితే ఆ వరాహం కూడా అటే వెళుతూ అతడ్ని నానా తిప్పలు పెట్టింది. ఓవైపు లైవ్ లో యాంకర్, ఇతర ప్రెజెంటర్లు సిద్ధంగా ఉన్నా.. ఆ పంది నుంచి తప్పించుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఇది చూసి స్టూడియోలో ఉన్నవాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.