హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య వివాదానికి కారణం. ‘జిహాదీలుగా మారాలనుకునే చాలా మంది హైదరాబాద్లోని అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేస్తున్నారు. అమెరికా ఆస్తులపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రశాంతత కోసం పోలీసులు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారా ?’ అని సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి సైబరాబాద్ పోలీసులు స్పందించారు.
Yes sir… We have specialised wings for collection of advance intel and our teams are on the job 24X7. Thanks for alerting us. Please keep us updated if you find anything suspicious.
— Cyberabad Police (@cyberabadpolice) January 6, 2020
‘అవును సార్.. ముందుగా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడం కోసం మాకు ప్రత్యేక బలగాలున్నాయి. మా టీంలు 24X7 పని చేస్తన్నాయి. మమ్మల్ని అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మమ్మల్ని అప్డేట్ చేయండి’ అని సైబరాబాద్ పోలీసులు ట్విట్ చేశారు. ఓ మతానికి చెందిన వారినే టార్గెట్ చేస్తూ.. సదరు నెటిజన్ ట్వీట్ చేయడం.. దానికి సైబరాబాద్ సీపీ బదులివ్వడం.. హైదరాబాద్ ఎంపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓవైసీ సైబరాబాద్ సీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘సార్.. మీరు ఎస్ సార్ అన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎంత మంది జిహాదీలు ఉన్నారో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఎంత మంది ఉన్నారో నంబర్ చెప్పండి. లేదంటే మీ ఉద్దేశం ఏంటో స్పష్టం చేయండి. మీరు కేవలం భక్తుడికి మాత్రమే సమాధానం ఇస్తారా? లేదంటే ఎంపీకి కూడా బదులిస్తారా?’ అని సజ్జనార్ను ఓవైసీ ప్రశ్నించారు.
@cpcybd sir you say "yes sir" please enlighten how many such "jihadi" are working in software companies kindly give a number if not please clarify what you exactly meant
Will you reply to an MP or only to a Bhakt? https://t.co/uEMhF7Or2v— Asaduddin Owaisi (@asadowaisi) January 8, 2020
అంతటితో ఆగని ఓవైసీ..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తప్పు అనే విధంగా మరో ట్వీట్ చేశారు. ‘సార్.. మీరేదైనా చేయండి. కానీ ఎన్కౌంటర్ పేరిట ఉదయం 5 గంటలకు హత్యలు చేయొద్దు. సాధ్యమైతే అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించండి. కానీ పొట్టలో బుల్లెట్లు దింపొద్దు. సీపీ సాబ్.. ఉగ్రవాదానికి మతం ఉండదు. నాథూరాం గాడ్సేను గుర్తుంచుకోండి’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.
@cpcybd sir whatever you do but no killings in name of "encounter" at 05am please, if possible arrest & as accepted 3rd degree will be given but pls no cartoos in stomach
CP saheb Terrorism has no religion, (remember NGodse) https://t.co/uEMhF7Or2v— Asaduddin Owaisi (@asadowaisi) January 8, 2020