(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
చెన్నై : విదేశాల నుండి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు కనబడటం చెన్నై విమానాశ్రయంలో కలకలం రేపింది. మలేషియా నుంచి వచ్చిన చైనా వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు. విమానాశ్రయంలో అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే రాజీవ్గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సింగపూర్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా ఇవే లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై విమానాశ్రయం ఒకే రోజు ఇద్దరి వ్యక్తులకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.