(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ మెడల్తో మోదీని సత్కరించింది. భారత్, యూఏఈల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును ఆదేశ యువరాజు జాయేద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ అందజేశారు.
దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. 130 కోట్ల మంది భారతీయులకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నానంటూ ట్వీట్ చేశారు. వ్యక్తిగా కంటే దేశ సాంస్కృతిక వైభవానికి దక్కిన గుర్తింపుగా ఈ పురస్కారాన్ని భావిస్తానని తెలిపారు. ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారం లభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని తనకు అందించినందుకు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు.
ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, బ్రిటన్ రాణి ఎలిజబెత్లు అందుకున్నారు.
Humbled to be conferred the ‘Order of Zayed’ a short while ago. More than an individual, this award is for India’s cultural ethos and is dedicated to 130 crore Indians.
I thank the UAE Government for this honour. pic.twitter.com/PWqIEnU1La
— Narendra Modi (@narendramodi) August 24, 2019
UAE confers ‘Order of Zayed’, the highest civilian award on Prime Minister @narendramodi pic.twitter.com/UioInPsTr6
— All India Radio News (@airnewsalerts) August 24, 2019