టెహ్రాన్: ఉక్రెయిన్కు చెందిన బోయింగ్ విమానాన్ని పొరపాటున కూల్చేశామని ఇరాన్ శనివారం వెల్లడించింది. ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడి జరిగిన కొన్ని క్షణాల వ్యవధిలోనే టెహ్రాన్ నుంచి బయలుదేరిన ఉక్రెయిన్ విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 176 మంది మరణించారు. అయితే ఆ విమానాన్ని కూల్చలేదని తొలుత ప్రకటించిన ఇరాన్.. ఇప్పుడు తన తప్పును అంగీకరించింది. ఉద్దేశపూర్వంగా తాము ఉక్రెయిన్ విమానాన్ని కూల్చలేదని ఇరాన్ స్పష్టం చేసింది. మానవ తప్పిదం వల్ల ఆ ప్రమాదం జరిగినట్లు ఇరాన్ అధికారిక టీవీ శనివారం పేర్కొంది. విమానం రివల్యూషరరీ గార్డ్స్ కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు రావడంతో శత్రు దేశపు విమానంగా భావించి కూల్చినట్లు ఇరాన్ మిలిటరీ తెలిపింది.
అటు ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జారిఫ్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ధ్రవీకరించారు. “ అదో బాధాకరమైన రోజు. అమెరికా వల్ల తలెత్తిన సంక్షోభం సమయంలో మానవ తప్పిదం కారణంగా ఈ ఘోరం జరిగింది సైనిక బలగాల అంతర్గత దర్యాప్తులో తేలింది. దీనికి మేం ఎంతో పశ్చాత్తాపడుతున్నాం. విమాన ప్రమాదంలో చనిపోయిన మృతిచెందిన కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నాం” అని జావద్ ట్వీట్ చేశారు.
A sad day. Preliminary conclusions of internal investigation by Armed Forces:
Human error at time of crisis caused by US adventurism led to disaster
Our profound regrets, apologies and condolences to our people, to the families of all victims, and to other affected nations.
?— Javad Zarif (@JZarif) January 11, 2020
గత బుధవారం(జనవరి 8) తెల్లవారుజామున టెహ్రాన్ ఎయిర్ పోర్టు నుంచి ఉడ్రెయిన్ రాజధాని కివ్ కు బయల్దేరిన ఉక్రెయిన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 176 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉక్రెయిన్ దేశస్థుల కంటే విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిగిన కొద్ది గంటలకే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రమాదం వెనుక ఇరాన్ దళాల హస్తం ఉన్నట్లు అమెరికా, కెనడా దేశాలు ఆరోపించాయి. విమానాన్ని క్షిపణి ఢీకొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇరాన్ అసలు విషయాన్ని చెప్పింది.