న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు కోలుకుంది. ఇక ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో జూలై 28న తీవ్రంగా గాయపడిన ఆ యువతిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్ది రోజుల తర్వాత లక్నో నుంచి ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఆమె న్యాయవాది కూడా తీవ్రంగా గాయప్డడాడు. ఆమె ఇద్దరు పినతల్లులు మృతి చెందారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇంకా యువతి వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి సిబిఐ బిజెపి శాసనసభ్యుడు కులదీప్ సింగ్ సెంగర్తో సహా పది మందిపై హత్య కేసు నమోదు చేసింది. యువతిపై అత్యాచారం చేసిన కేసులో జైలులో ఉన్న సెంగర్ ఆమెను అంతమొందించేందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు పైకి ట్రక్కు పంపాడన్నది అభియోగం.