లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై యూపీ మంత్రి సునీల్ భరాలా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ‘డబ్బున్న పశువు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత వారం కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి సిన్హా.. రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా యూపీ మంత్రి సునీల్ భరాలా స్పందించారు. సోనాక్షి ‘ధన పశువు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కాలంలో ఇలాంటి నటీనటులు కేవలం డబ్బు కోసమే బతుకున్నారు. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చుపెట్టాలి? అని మాత్రమే ఆలోచిస్తారు. చరిత్ర గురించి దేవుళ్ల గురించి అసలు ఏమీ తెలీదు. నేర్చుకోవడానికి సమయం కూడా కేటాయించరు. ఇంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై సోనాక్షి ఇంకా స్పందించలేదు.
Shame on you #sonakshisinha ? pic.twitter.com/BXTvvt6RZn
— Thakur Sunny Singh (@SunnySi69768462) September 21, 2019
ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వెళ్లిన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన చిన్న ప్రశ్నకు సమా ధానం ఇవ్వలేక పరువు పోగొట్టుకుంది. రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు? అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోవడమే కాకుండా.. లైఫ్ లైన్ తీసుకుంది. అయినా కూడా తప్పు జవాబిచ్చింది. దాంతో సోనాక్షి తల్లి పూనమ్తో పాటు అమితాబ్ కూడా షాకయ్యాడు. చిన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేకపోయిందంటూ.. సోనాక్షిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. దీంతో నెటిజన్స్ #YoSonakshiSoDumb అంటూ హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు.
https://twitter.com/sonakshisinha/status/1175328973653282816
అయితే తనను ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చింది సోనాక్షి. ‘డియర్ ట్రోల్స్.. నాకు పైథాగరస్ థియరం, మర్చెంట్ ఆఫ్ వెనిస్, పీరియాడిక్ టేబుల్, క్రోనోలజీ ఆఫ్ ది మొఘల్ డైనాస్టీ వంటి విషయాల గురించి కూడా ఏమీ తెలీదు. కాబట్టి ప్లీజ్.. మీకు వేరే పని లేకపోయినా, లేదా మీరు ఖాళీగా ఉన్నా.. వీటిని ఉద్దేశిస్తూ కూడా నన్ను ట్రోల్ చేసి మీమ్స్ రూపొందించండి. ఎందుకంటే నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం’ అని ట్వీట్ చేసింది. మరి ఇప్పుడు యూపీ మంత్రి వ్యాఖ్యలపై సోనాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి.