అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో అధికారికంగా చేరలేదు. దీంతో టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు.
ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వంశీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాను త్వరలోనే వైసీపీలో చేరుతానని, ఏపీ సీఎం వైఎస్ జగన్ తోనే తన పయనమని వంశీ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా సీఎం జగన్ తో పాటు వైసీపీకి చెందిన కీలకనేతలతో వంశీ పలుమార్లు వంశీ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం వంశీ వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.