ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్(40) సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్స్ వెంటిలేటర్స్పై ఆయనకు చికిత్సను అందించారు. పరిస్థితి మరింత విషమించి బుధవారం మధ్యాహ్నం 12గంటల 21 నిమిషాలకు కన్నుమూశారు. ఈయననకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
సూర్యపేట జిల్లా కోదాడలో 1970 డిసెంబర్ 30న జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్గా, హాస్య నటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 600 సినిమాల్లో నటించారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తొలిప్రేమ’ మంచి బ్రేక్ ఇచ్చింది.ఇక తనను నటుడిగా పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హంగామా’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘యువకుడు’, ‘దిల్’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’ ‘మాస్’ చిత్రాలు కమెడియన్గా మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో వెంకటేష్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మి’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు.
previous post
next post