(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సూపర్ సైక్లోన్ ఫోని అనుకున్నట్లుగానే ఒదిషా, పూరి వద్ద ఈ ఉదయం తీరం దాటింది. ప్రచండ గాలులు, భారీ వర్షాన్ని వెంటతీసుకువచ్చిన ఈ తుపాను ప్రభావం అది తీరం దాటడం మొదలుకాక ముందే ఉదయం ఎనిమిది గంటల నుంచే కనబడినట్లు వాతానరణ శాఖ తెలిపింది. తీరం దాటతున్నపుడు ఫోని తీవ్రత ఎంత ఉందో తెలిపే ఒక వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్లో పోస్టు చేసింది.
The sound and the fury : here's what the landfall at Puri by #CycloneFani actually looked like..
Video by @PIBBhubaneswar pic.twitter.com/4GpvKFkRQ3
— PIB India (@PIB_India) May 3, 2019
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఫోని తీరం దాటినపుడు గాలుల వేగం 150 నుంచి 175 కిలోమీటర్ల వరకూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ వేగంతోనే గాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో పూరి వద్ద సముద్రం భయంకరంగా అల్లకల్లోలం అయింది.
1999 నాటి సూపర్ సైక్లోన్ తర్వాత ఫోనీనే తూర్పు తీరాన్ని తాకిన అతిపెద్ద తుపాను. దీనిని కేటగిరి 4 స్థాయి తుపానుగా పరిగణించారు.