(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు మరోసారి తుళ్లూరు రైతుల్ని మోసం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. తుళ్లూరు రైతులు మరోసారి చంద్రబాబును నమ్మితే అంతకంటే అమయాకత్వం మరోకటి ఉండదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి రైతుల్ని చంద్రబాబు ఫణంగా పెట్టాడని అన్నారు. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నాడని విమర్శించారు. రైతులు ఎవరికీ అన్యాయం జరగదన్నారు. బాబును దూరం పెడితే అన్నీ పరిష్కారం అవుతాయని సలహా ఇచ్చారు.
తుళ్లూరు రైతులు @ncbnను
ఇంకోసారి నమ్మితే అంతకంటే అమాయకత్వం ఉండదు. తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఒకసారి వారిని ఫణంగా పెట్టాడు. మళ్లీ వారినే అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నాడు. ఎవరికీ అన్యాయం జరగదు. బాబును దూరం పెడితే అన్నీ పరిష్కారం అవుతాయి.— Vijayasai Reddy V (@VSReddy_MP) December 24, 2019
రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్ల రూపాయలకు చేరేదని ఆరోపించారు. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.
రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని @ncbn స్కెచ్ వేశాడు. అలా జరిగి ఉంటే వాటి విలువ 6-7 లక్షల కోట్లకు చేరేది. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 24, 2019
కాగా, ఏపీకి మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాజధానిలో పర్యటించిన చంద్రబాబు రైతులకు మద్దతు పలికారు. అమరావతి రైతాంగానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.