(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత దేశంలో ఐఐటి, జేఈఈ ఎంట్రెన్స్ పరీక్ష ప్రశ్నాపత్రంపై అస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్లు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇటీవల ఈ ప్రశ్నాపత్రం చూసిన ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్లు ప్రశ్నల కఠినత చూసి అవాక్కయ్యారు.
టిబీస్ అనే యూట్యూబర్ ఈ ప్రశ్నాపత్రంపై ఆరుగురు ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్లను ఇంటర్వ్యూ చేసి ఈ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన 24గంటల వ్యవధిలోనే నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు.
భారత దేశంలో ఐఐటి విద్యార్థులకు ఇంత కఠినతరంగా ప్రశ్నాపత్రం ఇస్తారా? అని ఒక ప్రొఫెసర్ ప్రశ్నించారు. తమ దేశంలో అయితే యూనివర్శిటీ స్థాయి విద్యార్థులకు మాత్రమే ఇటువంటి ప్రశ్నాపత్రంపై అవగాహన ఉంటుందని మరో ప్రొఫెసర్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఐఐటి, జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షలు రాస్తుంటారు.