న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ విభాగం సమావేశం ముగిసింది కానీ రాహుల్ గాంధీ అంతరంగంలో ఏముందో మాత్రం తెలియలేదు. శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీని ఛైర్పర్సన్గా ఎన్నుకున్నారు. లోక్సభలో పార్టీకి రాహుల్ నాయకత్వం వహించేదీ లేనిదీ తెలియరాలేదు. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిచారు. పార్టీ వర్కింగ్ కమిటీ అందుకు అంగీకరించలేదు. అయినా ఆయన పట్టిన పట్టు వీడలేదు. కనీసం లోక్సభలోనయినా నాయకత్వం ఇస్తారేమోనని అనుకుంటున్నారు.
శనివారం నాటి సమావేశంలో రాహల్ మాట్లాడుతూ, బిజెపిపై ప్రతిరోజూ పోరాడుతానని అన్నారు. మనకు ఇప్పటికీ 52 మంది ఎంపీలు ఉన్నారు. బిజెపిపై ప్రతిరోజూ పోరాడాలి. మీరు ప్రతి ఒక్క భారతీయుడి కోసం పోరాడుతున్నారు. ద్వేషం, పిరికితనం, ఆగ్రహంపై మీరు పోరాడుతున్నారు అని రాహుల్ అన్నారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకున్నది. గత ఎన్నికలలో గెలుచుకున్న 44 సీట్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. అయినా ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకత్వం హోదా ఇవ్వడానికి ఇంకా మూడు తక్కువ పడ్డాయి.
సోనియా చైర్పర్సన్గా ఎన్నికయినందుకు అభినందనలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు.
Congratulations to Smt Sonia Gandhi on being elected Leader of the Congress Parliamentary Party. Under her leadership, the Congress will prove to be a strong & effective opposition party, that will fight to defend the Constitution of India. pic.twitter.com/iUcdB51tHE
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2019