NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

మాస్క్ పెట్టుకోకపోతే మూడినట్లే..10వేల జరిమానా..!ఎక్కడంటే..?

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాలలో ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏమిటా నిర్ణయం అనుకుంటున్నారా? మాస్క్ లు లేకుండా ఎవరైనా ప్రజలు రోడ్డు మీదకు వస్తే మాడు పగిలిపోయేలా జరిమానా వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.500లో రూ.1000 రూపాయలో కాదు ఏకంగా పది వేయి రూపాయలు (100 పౌండ్ లు) జరిమానా వసూలు చేయనున్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి మాస్క్ లు లేకుండా తిరిగే వారి నుండి ఈ మేర జరిమానా వసూలు చేస్తారట. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కరోనా కట్టడికి ప్రధానంగా మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని పాలకులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. దీనితో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో 2లక్షల 91వేల కరోనా కేసులు నమోదు కాగా 44 వేల మంది మృతి చెందారు. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టవలసి వస్తుందన్న భయంతో బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు మాస్క్ లు ధరిస్తారేమో.

ఇండియాలో ఈ తరహా నిర్ణయం తీసుకుంటే…

ఇండియాలో కూడా ఒకప్పుడు బ్రిటన్, ఇంగ్లాండ్లలో ఎలా పెరిగాయో అదే మాదిరిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు రోజుకు 30 వేల వరకు పాజిటివ్ లు వస్తున్నాయి. నేటి వరకు ఇండియాలో 9 లక్షల 36వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 24,309మంది మరణించారు. 5 లక్షల 92వేల మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ లో మాదిరిగా సంచలన నిర్ణయాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఏపిలోనూ లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేసుల పెరుగుదల ఉన్న జిల్లాలు, ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గత వారం ప్రకాశం జిల్లలో 15 రోజులు లాక్ డౌన్ పెట్టారు. అది కొనసాగిస్తున్నారు. మొన్నటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో, నిన్నటి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్ పెట్టారు. ఇలా జిల్లాల వారీగా లాక్ డౌన్ లు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో నేటి వరకు 33వేల కేసులు నమోదు కాగా 408మంది మరణించారు. 17,467మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju